కామారెడ్డిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 27 (అఖండ భూమి న్యూస్)
, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గురువారం పరిశీలించారు పట్టణంలోని జి ఆర్ కాలనీ గల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి బాధితులకు అండగా ఉంటానని ఓదార్చారు. ఇంటింటికి వెళ్లి వరద తీవ్రతను జరిగిన నష్టాన్ని బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే రామారెడ్డి రోడ్డులో గల టీచర్ కాలనీలో పర్యటించారు అక్కడ ఇంటింటికి వెళ్లి బాధితులతో వివరాలను తెలుసుకున్నారు. కామారెడ్డి వాగు పొంగి వంశమైన రోడ్లను కాలనీలను పరిశీలించారు. అక్కడి నుండి దేవునిపల్లి లో గల నిజాంసాగర్ రోడ్డులో దంసమైన రోడ్లను ముంపుకి గురైన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు కామారెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కుంభాల రవి పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ యాదవ్, స్వామి, కృష్ణాజి రావు,, పాత హనుమాన్లు, భానుతో పాటు పలువురు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…