ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 28 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద బాధిత ప్రాంతాలను గురువారం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ , ఎంపీ సురేష్ షెత్కర్ పరిశీలించారు. ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలు, ముంపు గురైన కాలనీలో పరిస్థితులు స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారి, కామారెడ్డి జిల్లాలో పలు ముంపు ప్రాంతాలపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని వారినీ ఓదార్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు , ప్రజలు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…