బాలికల పాఠశాల-02లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
సామాన్యులకు చేరువ చేయడంలో అయన కృషి ఎనలేనిది : హెచ్ఏం. బి. మంగమ్మ.
అనంతగిరి, అఖండ భూమి న్యూస్:
అల్లూరి జిల్లా, అనంతగిరి మండల కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల-02లో ప్రధానోపాధ్యాయురాలు బి. మంగమ్మ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా హెచ్ ఏం. బి. మంగమ్మ మాట్లాడుతూ ఈరోజు తెలుగు కవులలో గొప్ప కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి అని అన్నారు,ఆయను తెలుగు భాషాకు చేసిన సేవలను గౌరవించుకోవటానికి ఆగస్టు 29న తెలుగు దినోత్సవం జరుపుకుంటారనీ తెలిపారు. ఈ తెలుగు భాషా గొప్ప తనాన్ని దాని ప్రాముఖ్యతను అను బంధాన్ని గుర్తు చేసుకోవాలన్నారు,గిడుగు వెంకట రామమూర్తి ఆధునిక తెలుగు భాషా కు చేసిన సేవలను ప్రాముఖ్యతని అతను చేసిన కృషి ని అయన చేసిన మార్పులు తెలుగు బాషా ను సామాన్యులకు దగ్గర చేసాయన్నారు,అలాగే తెలుగు భాషా గొప్ప చరిత్ర సంస్కృతిని కలిగి ఉందని సౌందర్యని మెచ్చుకోవాలనీ నేటి తరానికి తెలుగు భాషా సంప్రదాయాలతో అనుసరించడానికి ఈ దినోత్సవం ముఖ్య మని అన్నారు.అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమలు సాహిత్య పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్,అలాగే పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…