వర్ధముంపులు మృతి చెందిన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సంగమేశ్వర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన గోత్రాల బాలరాజు బాధిత కుటుంబానికి మండల వ్యవసాయ అధికారిని మణిదీపిక 20వేల రూపాయలను ఆర్థిక సహాయంగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర మండలాలు, జిల్లాలలో తోటి వ్యవసాయ శాఖ అధికారులుగా పనిచేస్తున్న 30 మంది కలసి ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగిందని తెలిపారు. పిల్లలకు చదువు నిమిత్తం కావలసిన అవసరాలుంటే తమను సంప్రదించాలని సూచించారు. బాయిత కుటుంబానికి చెందిన రుత్విక్ సాకేత్ ను ఓదార్చారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…