వరద బాధితుల కుటుంబాలను పరామర్శిం

చిన ఎమ్మెల్సీ విజయశాంతి….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా భారీగా నష్టపోయిందని తెలుసుకొని ఎమ్మెల్సీ విజయశాంతి తో పాటు జిల్లా కలెక్టర్ ఆశిష్ లు ఆదివారం పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జి ఆర్ కాలనీలోని ముంపుకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను నివేదికల ఆధారంగా ఆదుకుంటామని ఎమ్మెల్సీ విజయశాంతి కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో పంట నష్టాలతో పాటు రోడ్లు, ఇతర అన్ని నష్టాలపై నివేదికలు ప్రభుత్వానికి అందించిందని దీనిపై పూర్తిస్థాయిలో ప్రజలకు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. అధికారులు బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆమె కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…
దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..
గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్ …


