వరద బాధితుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ విజయశాంతి….

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా భారీగా నష్టపోయిందని తెలుసుకొని ఎమ్మెల్సీ విజయశాంతి తో పాటు జిల్లా కలెక్టర్ ఆశిష్ లు ఆదివారం పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జి ఆర్ కాలనీలోని ముంపుకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను నివేదికల ఆధారంగా ఆదుకుంటామని ఎమ్మెల్సీ విజయశాంతి కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో పంట నష్టాలతో పాటు రోడ్లు, ఇతర అన్ని నష్టాలపై నివేదికలు ప్రభుత్వానికి అందించిందని దీనిపై పూర్తిస్థాయిలో ప్రజలకు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. అధికారులు బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆమె కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…


