కూలిపోయిన ప్రహరీని పరిశీలించిన దోమకొండ కాంగ్రెస్ నాయకులు…

కూలిపోయిన ప్రహరీని పరిశీలించిన దోమకొండ కాంగ్రెస్ నాయకులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా దోమకొండ. దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ప్రహరీ ముంచెత్తిన వర్షంతో, కుంగిపోయి కూలిపోయింది. కూలిపోయిన ప్రహరిని ఆదివారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. 20 గజాల మేర ప్రహరీ కూలిపోవడంతో, విద్యార్థినులు, గురుకుల పాఠశాల సిబ్బందికి రక్షణ లేకుండా, భయాందోళనగా ఉందని అన్నారు. తక్షణమే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి, ప్రహరీ బాగు చేయించేందుకు కృషి చేస్తామని అన్నారు ‌. కార్యక్రమంలో

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, ఐరేని నర్సయ్య, నల్లపు శ్రీనివాస్, సీతారాం మధు, ఆబ్రబోయిన రాజు, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!