బిబిపేట్ లో మహాగణపతి అభిషేకాలు లో పాల్గొన్న దంపతులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో శ్రీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహా గణపతి అభిషేకాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాగణపతి అభిషేకాలు, కుంకుమ పూజలు లో వందలాదిమంది దంపతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులతో పాటు వైశ్య సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


