నేడు రాధాష్టమి రాధాదేవి…

నేడు రాధాష్టమి రాధాదేవి…

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31,(అఖండ భూమి న్యూస్)

బృందావనంలో ‘భక్తి’ విశ్వ రూపాన్ని చూడవచ్చు.

బృందావన వాసులు కృష్ణుణ్ని తమ ఇంటిలో సభ్యుడిగా భావిస్తారు.

బృందావనంలో శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతి గృహంలో పూజా మందిరంలో గాక, నట్టింట్లో ఉంటుంది. బృందావనం రాధాకృష్ణుల విహార భూమి.

ఈ ‘రాధ’ ఎవరు?- ఈ ప్రశ్నకు భాగవతంలో సమాధానం కనిపించదు. ప్రజభాగవతం రాధ కథను రసరమ్యంగా రమణీయంగా అభివర్ణిస్తుంది. ‘బృందావనంలో ఇప్పటికీ రాధాదేవి నామం అన్ని సంద ర్భాల్లో అందరినోటా వినిపిస్తుంది. బండి తోలేవాళ్లు సైతం అడ్డువచ్చే జనాన్ని పక్కకు తొలగమని చెప్పడానికి ‘రాధే రాధే’ అంటారు. తమ ఇంటిలో దేవుడున్నాడని దేవుడి ఇంటిలో తామున్నామని భావించుకుంటారు. భక్తిరసం ప్రతి ఇంటా పొంగుతుంది.

లాక్షణికులు రసాలు తొమ్మిది అని పేర్కొన్నారు. వాటిలో భక్తి ని రసంగా ఎవరూ చెప్పలేదు. భాగవతం విన్నవారు భక్తి రసాన్ని ఆస్వాదిస్తారు. పోతనామాత్యుడి భాగవతం చదివిన వారెవరైనా భక్తినిరసంగా అంగీకరిస్తారు.రాధాకృష్ణుల విహార భూమి బృందా వనం ‘ధామం’ దేవతల నివాస భూమిని ధామం అంటారు.

బృందావనంలో మనం సంచ రించేటప్పుడు మారుమూల ప్రదేశాల్లో సైతం రాధాకృష్ణ కీర్తనం వినిపిస్తుంది. శ్రీకృష్ణుడు పూర్ణావతార మని చెబుతూ, ఆ స్వామి లీలావతారమని, ఆయనను సంకీర్తనం చేయ డం ద్వారా మనకు విజయం కలుగుతుందని చైతన్య మహా ప్రభువు పలికాడు. అటువంటి కృష్ణుని చేరే మార్గం ఏది?కృష్ణు డే స్వయంగా ఆ మార్గాన్ని చెబుతాడు- ‘రాధను ధ్యానం చేయకుండా ఎవరూ నా కృపను పొందడం జరగదు. ఇది ముమ్మాటికీ నిజం’రావల్ గ్రామం బృందావన సమీపంలో ఉంది. కీర్తిదేవి వృషభానులకు రాధాదేవి కుమార్తె భాద్రపద శుద్ధ అష్టమినాడు ఈ బాలిక పుట్టినప్పుడు ఆ దివ్య బాలి కను చూసి నారదుడు స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ లోకి వచ్చిన తరవాత తాను చూస్తున్నది “గోలోక నాయిక” అని గుర్తించాడు. నారదుడు రాధను స్తుతించి, ఆమె తల్లి దండ్రులను దీవించాడు. పుట్టి నప్పుడు రాధకు చూపు లేదు. ఆ బిడ్డను చూడాలని బంధు మిత్రులు ప్రతిదినం వెళ్తూ ఉండేవారు. బాలకృష్ణను చంకనవేసుకొని యశోదమ్మ కూడా వెళ్లింది. యశోదమ్మ చిన్ని కన్నయ్య అమ్మ చంకలో ఉండే రాధను చూశాడు. రాధ కన్నులు తెరిచింది. ఆ గోలోక దేవత భూమిపైకి వచ్చిన తరవాత మొదటగా కృష్ణుణ్ని చూడాలనేకోరికతీరింది.రాధాదేవి పెరిగి పెద్దదై మెరుపు తీగ లాగా మెరిసిపోతున్నది. కృష్ణు డు పెరిగి పెద్దవాడై జగన్మో హనుడయ్యాడు. సూర్యదేవా లయంలో ఇరువురూ కలుసు కున్నారు. రాధాకృష్ణుల ప్రేమ కు రాధాకృష్ణుల ప్రేమే సాటి.

రాధాదేవి తులసికి పంచా మృతాలతో అభిషేకించి, ప్రదక్షిణ చేసింది. తులసీదేవిని మంత్రంతో జపించేది. తులసి మాత సంతోషించి రాధాదేవికి ప్రత్యక్షమైంది. ‘రాధా! నువ్వు మానవజాతిలో జన్మించిన గోలోకేశ్వరివి. నీ ప్రియుడైన కృష్ణుడితో నీకు కల్యాణం తప్పక జరుగుతుంది. బ్రహ్మ దేవుడి పౌరోహిత్యంలో నీకు పెండ్లి జరుగుతుంది!’ అని తులసీదేవి రాధా దేవిని దీవించింది. ఆమె చెప్పినట్లుగా బ్రహ్మ దేవుడు వచ్చి వారికి వివాహం జరిపాడు.తాము గోలోక నాయికా నాయకులు అన్న సంగతిని రాధాకృష్ణులు స్మరించుకున్నారు. వారి బృందం గోవులూ గోపాలు రుగా జన్మలెత్తారు. రాధా కృష్ణులు విహరించే ఆ నేల పవిత్రత సంతరించుకుంది. దివ్యానంద రసానంద ప్రదాయిని రాధాదేవిని ‘రసేశ్వరి’గా భావిస్తారు.

Akhand Bhoomi News

error: Content is protected !!