- మూడు రోజులపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 1 (అఖండ భూమి న్యూస్)
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం హాయ్ ఆ జిల్లాలో భారీ వర్షాల కారణంగా దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీనితోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చునని చెప్పారు.
నేడు కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉంది అంచనా వేశారు. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



