కాలేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా, రస్తా రోకో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గండ్ర మధుసూదన్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుంచాల శేఖర్, సింగిల్ విండో చైర్మన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగామాట్లాడుతూ.
ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాకుండా తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది కుట్రపూరితంగాజరుగుతుందన్నారు.సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే….
నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు. తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.
ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గజవాడ శ్రీకాంత్, కడారి రమేష్, మల్లెబోయిన రాజు, బొమ్మెర శ్రీనివాస్, పాలకుర్తి శేఖర్, కూర చంద్రం, చెన్నుగారి నర్సింలు, కుంచాల సత్యనారాయణ, కిషన్ రెడ్డి, విజయ్, నాగరాజ్, ఐరేని రాజేందర్ , అబ్రబోయిన చంద్రయ్య, శివంది సత్యం, వంగ లలిత, సంజీవ్ దోమకొండ మండల పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.