తాళ్ల రాంపూర్ లో ఈనెల 19న విడిసి సభ్యుల ఇండ్ల ముట్టడికి భారీగా గౌడ సోదరులు తరలి రావాలి
– జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోళ్ళ మురళి గౌడ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18. (అఖండ భూమి న్యూస్) నిజామాబాద్ జిల్లాలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో విడిసి సభ్యుల ఆగడాలను అడ్డుకోవడానికి విడీసీ సభ్యుల ఇండ్ల ముట్టడికి జై గౌడ ఉద్యమం జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. విడిసి ఆగడాల వల్ల గౌడ బిడ్డలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోల్ల మురళి గౌడ్ అన్నారు. కామారెడ్డి లోని జై గౌడ ఉద్యమం కార్యాలయంలో గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాళ్ల రాంపూర్ గ్రామంలో విడిసి సభ్యులు గౌడ బిడ్డలను ఒక రూములో వేసి బంధించడం దారుణం అన్నారు. విడిసి ఆగడాలపై తిరుగుబాటు యుద్ధం మొదలైంది అన్నారు. దీనిలో భాగంగా జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో తాళ్ల రాంపూర్ విడిసి సభ్యుల ముట్టడికి శుక్రవారం భారీ సంఖ్యలో గౌడ బిడ్డలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



