బస్తీ దావఖానాలలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 24 (అఖండ భూమి న్యూస్) బస్తీ దవాఖాన ద్వారా నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ తో కలిసి కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడ బస్తీ దవాఖానను సందర్శించి బస్తీ దవాఖానాలో అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. వైద్యులు మరియు వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి వైద్యులు మరియు వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బస్తి దావకానకు వచ్చినటువంటి రోగులను బస్తీ దావకానాలో అందుతున్నటువంటి సేవలను అడిగి తెలుసుకుని వారికి బస్తీ దవాఖాన యొక్క ప్రాధాన్యతను వివరించి ఎలాంటి వైద్యసేవలు అవసరమైన తక్షణమే బస్తీ దవాఖానను సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు. అలాగే అధిక వర్షాల వలన సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రితో పాటు ఆసుపత్రి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
బస్తీ దవఖానకు పక్కన నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణం పరిశీలించి నాణ్యతగా, వేగంగా భవన నిర్మాణం పూర్తయ్యేలా పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి తాహసిల్దార్ జనార్ధన్ తదితరులు ఉన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


