దుర్గామాత వద్ద అన్నదానం. ఊరేగింపులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26 (అఖండ భూమి న్యూస్) శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా దోమకొండలోని దుర్గమ్మ ఆలయం వద్ద పెరిక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదట మాలధారణ స్వాములతో కలిసి సంఘ సభ్యులు ఊరేగింపుగా అమ్మవారిని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వద్ద ఉదయం సాయంత్రం పూట ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మర్రి శేఖర్. అంకత్ నర్సింలు. సత్యనారాయణ. పోచయ్య. నాగరాజ్. అబ్బయ్య. పిన్నెం రామచంద్రం. రవి. చంద్రం. బోడ కుంటి రవి. రమేష్. రాజేందర్. తో పాటు పలువురు పాల్గొన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


