దసరా పండుగ తారీకును మార్చి ప్రకటించండి

బెల్లంపల్లి సెప్టెంబర్ 29 అఖండ భూమి న్యూస్):సింగరేణి యజమాన్యం సెకండ్ అక్టోబర్ రోజున గాంధీ జయంతి విజయదశమి ఒక్కటే రోజు జరుపుకొనుటకు పేడ్ హాలిడేగా సర్కులర్,ref no crp/per/ir/h/240/1213 సర్క్యులర్ ప్రకారంగా పండగలు జరుపుకోవాలని తెలిపారు. గాంధీ జయంతి రోజున వచ్చిన దసరా సెలవు ను అక్టోబర్ మూడవ తేదీన మార్చాలని గాంధీ జయంతి రోజున జీవహింస చేయకూడదు అలాగే తెలంగాణలో తెలుగు వారందరికీ దసరా పండగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టీ.మణి రామ్ సింగ్ తెలిపారు.అలాగే గాంధీ జయంతి దసరా ఒకేరోజు రావడం వల్ల గనులపై మైసమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకోలేకపోతున్నారు కాబట్టి దసరా పండగ తేదీని మూడవ తారీకు మార్చాలని అలాగే కోల్ ఇండియాలో దసరా పండగ సెలవును మార్చినారు. కాబట్టి సింగరేణి సీ & ఎండికి టీఎన్టీయూసీ కి మనవి చేస్తు అంతట దసరా పండుగ తేదీ మార్పు చేశారు.సింగరేణిలో కూడా మీరు కో ఉల్ బెల్ట్ లో కార్మికుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలందరూ సీఎన్ఎండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పండుగ తేదీ మార్పు ప్రకటించే విధంగా ఒత్తిడి పెంచాలని టిఎన్టిసి నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం ఆఫీస్ ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు…


