దేశ రక్షణ చేయడంతో పాటు రక్తదానం చేయడం అభినందనీయం..
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన బాణాల మహేందర్ రెడ్డి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో హెడ్ కానిస్టేబుల్ గా 23 సంవత్సరాలుగా విధులను నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ మానవత్వాన్ని చాటుతున్నాడని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ డాక్టర్ బాలు తెలియజేశారు.
దేశ రక్షణ కోసం ఒకవైపు విధులను నిర్వహిస్తూ,తోటి వారి ప్రాణాలను కాపాడాలనే మంచి ఉద్దేశంతో ఐదవ సారి రక్తదానం చేసినందుకు బాణాల మహేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.గతంలో ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని అన్నారు. దేశం కోసం పనిచేస్తూనే మానవత్వాన్ని చాటుతున్నడం అభినందనీయమని అన్నారు.కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల తరఫున అభినందనలు తెలియజేశారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



