అహింస ,శాంతికి మార్గం మహాత్మా గాంధీ ఆదర్శం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 3 (అఖండ భూమి న్యూస్);
మహాత్మా గాంధీ చూపిన అహింసా, శాంతి మార్గం ద్వారానే సమాజంలో ఉన్న సమస్యలు, విభేదాలు, వత్తిడులను అధిగమించొచ్చని
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
గురువారం మార్కెట్ యార్డ్ గంజిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాక, అహింసా సిద్ధాంత పితామహుడని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలో ఆయన చూపిన మార్గం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ తహసిల్దార్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


