త్రాగునీరు కోసం రోడ్డెక్కిన కామారెడ్డి డబ్బులు బెడ్ రూమ్ కాలనీవాసులు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డ్ రామేశ్వరపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసులకు గత నెల రోజులుగా త్రాగు నీరు రావడం లేదని డబల్ బెడ్ రూమ్ వాసులు సిరిసిల్ల బైపాస్ వద్ద ధర్నా శనివారం నిర్వహించారు. మున్సిపల్ డిఈ , ఎఈ రావాలని డబల్ బెడ్రూం కాలనీవాసులు పెద్ద ఎత్తున మహిళలు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి ఎస్సై రంజిత్ పోలీసులు అక్కడ చేరుకొని డిఈ, ఏఈలను రప్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు. డిఈ హనుమంతరావుకు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఈ హనుమంతరావు మాట్లాడుతూ. వారం రోజులలో నీటి సమస్యను పరిష్కరిస్తానని , బోరులో మోటర్ పెట్టిపించి నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


