త్రాగునీరు కోసం రోడ్డెక్కిన కామారెడ్డి డబ్బులు బెడ్ రూమ్ కాలనీవాసులు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డ్ రామేశ్వరపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసులకు గత నెల రోజులుగా త్రాగు నీరు రావడం లేదని డబల్ బెడ్ రూమ్ వాసులు సిరిసిల్ల బైపాస్ వద్ద ధర్నా శనివారం నిర్వహించారు. మున్సిపల్ డిఈ , ఎఈ రావాలని డబల్ బెడ్రూం కాలనీవాసులు పెద్ద ఎత్తున మహిళలు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి ఎస్సై రంజిత్ పోలీసులు అక్కడ చేరుకొని డిఈ, ఏఈలను రప్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు. డిఈ హనుమంతరావుకు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఈ హనుమంతరావు మాట్లాడుతూ. వారం రోజులలో నీటి సమస్యను పరిష్కరిస్తానని , బోరులో మోటర్ పెట్టిపించి నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


