సీఎం పదవి విషయంలో నో కాంప్రమైజ్ : డీకే శివకుమార్

 

 

సీఎం పదవి విషయంలో నో కాంప్రమైజ్ : డీకే శివకుమార్

కర్ణాటక సీఎం కుర్చీ అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన ఢిల్లీకి రావాలని హై కమాండ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగా బెంగళూర్‌లో కేసీ వేణుగోపాల్‌తో డీకే మంతనాలు జరిపారు. అయితే ఈ భేటీలో సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్ కోరినట్లు తెలుస్తోంది. తన వల్లే ఓల్డ్ మైసూర్‌లో ఎక్కువ సీట్లు వచ్చాయని, వొక్కలిగ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లాయని డీకే తెలిపినట్లు సమాచారం. సీఎం పదవి విషయంలో రాజీకి సిద్ధంగా లేనని, పవర్ షేరింగ్ కు కూడా డీకే ససేమిరా అన్నట్లు తెలిసింది.

Akhand Bhoomi News

error: Content is protected !!