*ఆటో డ్రైవర్లకు శుభవార్త! ప్రభుత్వం కొత్త ఆప్ రాబోతుంది..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 7 (అఖండ భూమి న్యూస్);
ఓలా, ఉబర్ ఆటో తరహాలో ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం త్వరలో కొత్త యాప్ను విడుదల చేయనుంది.
ఈ విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఈ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఆటోను బుక్ చేసుకోవచ్చు.
ఆటో స్టాండ్లలో డ్రైవర్లు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
ఈ సదుపాయం నచ్చిన డ్రైవర్లు మాత్రమే ఇందులో నమోదు చేసుకోవచ్చు.
ఎవరికి కమిషన్ చెల్లించాల్సిన పని లేదు — డ్రైవర్లకు పూర్తి లాభం!


