బీసీలకు రిజర్వేషన్ దక్కెవరకు పోరాటం ఆగదు
బెల్లంపల్లి అక్టోబర్ 10(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీసీల హక్కుల కోసం గళమెత్తిన నేతలు”బెల్లంపల్లిలో బీసీ సంఘాలు,నాయకులు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.“మేమెంతో మాకు అంతే” అనే నినాదంతో జరిగిన సమావేశంలో,బీసీలకు న్యాయబద్ధమైన హక్కులు ఇవ్వాలంటూ గళమెత్తారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ..స్థానిక సంస్థల్లో అమల్లో ఉన్న 42 శాతం రిజర్వేషన్ను ప్రభుత్వం కొనసాగించాలి అని డిమాండ్ చేశారు.
ఒకవేళ రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తినా,రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల్లో కూడా బీసీలకు అదే స్థాయిలో రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు.దేశంలో బీసీలు 60 శాతం ఉన్నా,రిజర్వేషన్ మాత్రం 27 శాతం మాత్రమే ఉంది.బీసీలకు రాజకీయ రిజర్వేషన్ బిల్లు తక్షణం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.నాయకులు మహిళల రిజర్వేషన్ బిల్లు తరహాలోనే బీసీల బిల్లు కూడా తక్షణం తీసుకురావాలని కోరారు.
రాచరికాలు పోయినా ప్రజాస్వామ్యంలో బీసీలకు న్యాయం జరగడం లేదు,అని నేతలు వ్యాఖ్యానించారు.రాజకీయ పార్టీలన్నీ స్పందించాలని,న్యాయపరమైన రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు…
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



