ప్రపంచ మానవాళి పుస్తకాన్ని రమేష్ రావణుకు బహూకరించడం అభినందనీయం…

ప్రపంచ మానవాళి పుస్తకాన్ని రమేష్ రావణుకు బహూకరించడం అభినందనీయం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 14 (అఖండ భూమి న్యూస్);

భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్, కామారెడ్డిజిల్లా చీఫ్ టి. ఎన్ రమేష్ రావణ్ని,
నిజామాబాద్ జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, (ఎంపీజే) జమాతే ఇస్లామి నాయకులు హుస్సేన్ నేతృత్వంలో జిల్లా నాయకులు,
ప్రపంచ మానవాళి జీవన విధాన సరళి నియమావళి అనే పుస్తకాన్ని రమేష్ రావణ్ కి బహుకరించి మంగళవారం సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ నాయకుడు రమేష్ రావణ్ మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై అనునిత్యం పోరాడుతూ, కల్తీ వ్యాపారాలను, కరప్టర్ అధికారులను దారిలో పెట్టేందుకే భీమ్ ఆర్మీలో పనిచేస్తున్నానని, సమస్త మానవాళిని ఏక కోణంలో చూడడం కొరకు బడుగు బలహీన వర్గాలను చైతన్య పరిచేందుకు అందించిన పుస్తకం తన జీవనశైలికి ఒక స్నేహంగా తోడ్పడుతుందని, ఆయన మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నిజామాబాద్ ప్రముఖ
జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!