ఐ సీ డీ ఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం

బెల్లంపల్లి అక్టోబర్ 16( అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో గురువారం ఐ సీ డి ఎస్ ప్రాజెక్ట్ బెల్లంపల్లి పోషణ మాసం కార్యక్రమం తాళ్లగురజాల రైతు వేదికలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్,పీ హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ ఇవాంజెలినా,సీడీపీఓ స్వరూప రాణి,సూపర్వైజర్స్,పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రజిత,డి పీ ఏ శ్యామల,ఉమెన్ హబ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సౌజన్య,అంగన్వాడీ టీచర్స్,గర్భిణీ స్త్రీలు,ప్రీస్కూల్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు..ఈ పోషణ మాసం కార్యక్రమాన్ని ఉద్దేశించి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,జిల్లా సంక్షేమ అధికారి,మెడికల్ ఆఫీసర్, సీడీపీఓ లబ్ధిదారులకు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత,అనుబంధ పోషకాహార ప్రాముఖ్యత,ఐవైసీఎఫ్ పద్ధతులు,తల్లిపాలు ప్రాముఖ్యత,
ఈసీసీఈ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది…
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


