.*రక్తదానం చేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ..!
*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న మంజుల కు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో సింగరాయపల్లి గ్రామానికి చెందిన అన్నేబోయిన ప్రశాంత్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానం పట్ల అవగాహనను పెంపొందించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేల ప్రకారం రక్తదానం చేసే వారికి గుండె జబ్బు క్యాన్సర్ కొలెస్ట్రాల్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలియజేయడం జరిగిందని రక్తదానం చేయడం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడమే కాకుండా మన ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చునని అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు,రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతకు అభినందనలు తెలిపారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


