ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 31(అఖండ భూమి న్యూస్):
దేశంలో విప్లవాత్మకమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన గొప్ప ప్రజా నాయకురాలు, తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె మారక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, దేశంలో భూ సంస్కరణలు, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేసిన ఆమె సేవలు దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. ఆమె చూపిన మార్గంలో పయనించేందుకు కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపు శ్రీనివాస్, అబ్రబోయిన రాజేందర్, అండెం శంకర్ రెడ్డి, సీతారాం మధు ముదిరాజ్, మర్రి శేఖర్, కదిరి గోపాల్ రెడ్డి, షమ్మీ, పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, నేతుల సుధాకర్, సాయబు గారి రాజు, నిమ్మ బాలరాజు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


