ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులివ్వాలి…
టి.టి.యు.” డిమాండ్*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 2 (అఖండ భూమి న్యూస్);
*రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు టి.టి.యు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం.డి. ముజిబొద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాంబ్లె గోపాల్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాండ్రె శ్రీనివాసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
*రాష్ట్రంలో ఒకటి నుంచి పది మంది విద్యార్థుల వరకు ఉన్న ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలకు మొదటి విడత 50 శాతం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ను విడుదల చేయకపోవడం శోచనీయమని అన్నారు.*
*నిధులను విడుదల చేసినట్టు ఉత్తర్వులను విడుదల చేసినప్పటికీ పాఠశాలల ఖాతాల్లో మాత్రం నిధులు జమ కాలేదని తెలిపారు.
ఇప్పటికైనా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వెంటనే స్పందించి స్కూల్ గ్రాంట్ ను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు..
You may also like
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి *ఆపరేషన్ సింధూర్ పై* అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మ దహనం..!
మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు..!
ఇస్రో మరో భారీ ప్రయోగం.. నింగిలోకి ‘బాహుబలి’ రాకెట్!
విద్యా మానసిక వికాసానికి దోహదం చేస్తే, క్రీడలు శరీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.
పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన చంద్రశేఖర్ రెడ్డి…


