శిథిలావస్థలో ఉన్న పాఠశాల అదనపు గదుల కూల్చివేత పనులను పరిశీలించిన తిరుమల్ గౌడ్…

శిథిలావస్థలో ఉన్న పాఠశాల అదనపు గదుల కూల్చివేత పనులను పరిశీలించిన తిరుమల్ గౌడ్…

కామారెడ్డి జిల్లా దోమకొండ. పలుగడ్డ ఉన్నత పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో 2 అదనపు గదులు ఇబ్బందికరంగా ఉండగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం కూల్చివేత పనులను నిర్వహించారు. ఆయా పనులను తిరుమల గౌడ్ పరిశీలించారు. డీఈఓ రాజుతో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు జస్వంత్ రావు తన చొరవతో శిథిలావస్థలోనున్న అదనపు గదులను కూల్చివేయటం విద్యార్థులకు మేలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయు మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బోడ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!