రైతాంగానికి అండగా నిలబడదాం..!

రైతాంగానికి అండగా నిలబడదాం..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 4.

(అఖండభూమి న్యూస్):

రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర చెల్లించకుండా పాలక ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టి, అండగా నిలవాల్సిన అవసరం మనందరిపై ఉంది. దేశంలో రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ఒక జంట కుక్కలు కొనుగోలు చేసే స్థాయిలో ఉన్న మన దేశం రైతులకు ఎందుకు అండగా నిలబడా లేకపోతున్నాం. 20 కోట్లు వెచ్చించి ఒక్కరే ప్రయాణించే కార్లు కొనుగోలు చేసే స్థాయిలో ఉన్న మన దేశం రైతాంగానికి ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నాం. 200 కోట్లు వెచ్చించి క్రికెట్ జట్లను వేలంలో కొనుగోలు చేసే స్థాయిలో ఉన్న మన దేశ పెట్టుబడిదారులు రైతాంగం కోసం ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు. లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిదారుల హక్కులను మాఫీ చేసే పాలకులు రైతాంగం బాధలను తీర్చేందుకు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు. 20వేల కోట్ల రూపాయలు వినోదానికి కేటాయించే మన దేశం మనకు అన్నం పెట్టే రైతుకు ఎందుకు అండగా ఉండలేకపోతున్నాం. రెండు లక్షల కోట్ల విలువైన స్ట్రక్రం (హెయిర్ వేవ్స్) వేలం వేసే స్థాయిలో ఉన్న మన పాలకు లు రైతుల కష్టాల పరిష్కారం కోసం ఎందుకు శ్రద్ధ చూపడం లేదు. మమ్మల్ని లేదా మేము పండించే ధాన్యాన్ని మాత్రం ఎవరు వేలం వేయడానికి రారు అని రైతులు ప్రశ్నిస్తుంటే, సగటు భారతీయునిగా మనం ఎందుకు స్పందించడం లేదు. పంట పండించిన రైతు బిక్షగాడిగా మారుతుంటే, అధిక ధరలకు అమ్మే వ్యాపారులు మొత్తం లక్షాధికారులు అవుతున్నారు. చదివే హృదయం నొప్పించింది, నేను చదివాను, పంచుకున్నాను, రైతులను రక్షించకపోతే రేపటి భవిష్యత్తు ఏమిటి….

Akhand Bhoomi News

error: Content is protected !!