తేనె వినియోగం మోతాదుకు మించితే మహా ప్రమాదం….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 8
(అఖండభూమి న్యూస్):
ఇటీవల ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరూ తేనెను వినియోగిస్తున్నారు. అయితే తేనే మోతాదుకు మించి వినియోగిస్తే మొదటికే మోసమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోని అధిక ప్రక్టోజ్ వల్ల పార్టీ లివర్ సమస్య వస్తుందని అన్నారు. శరీరంలోని విష పదార్థాల తొలగింపులో కాలేయానిది ప్రధాన పాత్ర అని చెప్పారు. అధిక తేనెతో దానిలో కొవ్వు పేరుకుపోయి పనితీరు నష్ట పరుస్తుందని తెలిపారు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు అధికం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. మోతాదుకు మించి తేనె వినియోగించడం వలన అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ వలన అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు….


