ఆర్టీసీ బస్సును ఢీకొని ఒక యువకుడు మృతి, .
మరో ఇద్దరికి గాయాలు
రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాజవొమ్మంగి మండలం వైకుంఠపురం గ్రామం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఏలేశ్వరం నుండి రేవళ్లకు వస్తున్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టడంతో.. బైక్ నడుపుతున్న వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. ప్రమాదంలో మరో చిన్నారి, మహిళకు గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.