నేడే రాజ్యాంగ దినోత్సవం
ఎందుకు జరుపుకుంటారు..?
సివిక్స్ లెక్చరర్ ఉమశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 25,(అఖండ భూమి న్యూస్ );
జాతీయ దినోత్సవం అ కూడా అంటారు. రాజ్యాంగం రాజ్యాంగ పరిషద్ చే ఆమోదించబడ్డ రోజు నవంబర్ 26, 1949 సంత్సరం ఇది ఆమోదించారు. జనవరి 26,1950 లో అమల్లోకి వచ్చింది.మోడీ ప్రభుత్వం 19, నవంబర్ 2015 న గెజిట్ నోటిఫికెషన్ ద్వారా నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది.11 అక్టోబర్ 2015 ముంబయిలోని బి.ఆర్.అంబేద్కర్ ఒక్క స్మారక విగ్రహానికి శంకుస్థాపన చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రకటన చేసినారు. 2021సంవత్సరం అంబేద్కర్ 131 వ జయంతి, రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి,రాజ్యాంగం ఒక్క ప్రాముఖ్యతను వ్యాప్తి చేయడానికి,అంబేద్కర్ ఆలోచనలు వ్యాప్తి చేసే ఉద్దేశ్యం తో నవంబర్ ను 26 ఎంచుకున్నారు. జాతీయ న్యాయ దినోత్సవం 2021 నవంబర్ 26 మోదీ ప్రసంగం లోకసభ స్పీకర్ కూడా కార్య క్రమంలో ప్రసంగించారు. దీనికి నేపథ్యం రాజ్యాంగ పీతమహుడిగా పిలువబడే అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891. 6డిసెంబర్ 2015 నాటికి అంబేద్కర్ జయంతి 125 వ జయంతి సందర్భం తో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు రాజ్యాంగం విలువ తెలుపలని ఉద్దేశంతో దీన్ని అధికారికంగా ప్రకటించారు అప్పటినుండి న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సంవిధాన్ దివస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోను వేడుకలను నిర్వహి స్తున్నాం. భారత రాజ్యాంగం నవంబర్ 26 అమలులోకి వచ్చి 75 సంత్సరాలు అవుతుంది. ఎన్నో ఆటుపోట్లు ఎదురైన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సామాన్యులు సైతం రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు అవ్వడం కాకుండా ప్రజా స్వేచ్ఛకు లిఖిత పూర్వకంగా హక్కులు కల్పించిన రాజ్యాం గం. అనేక రక్షణలు కల్పించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్తద్వారా అంతిమంగా ప్రజలే సార్వభౌములు అనే విధానం ప్రకటించింది.1976 సంత్సరం లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక లేదా పీఠిక “భారత దేశ ప్రజలం అయిన మేము భారతదేశాన్ని సర్వసత్తాక లౌకిక ప్రజాస్వా మ్య గణతంత్ర రాజ్యాంగ ఆమోదించుకున్న చట్టాన్ని అంగీకరిస్తున్నాం.సమగ్ర స్వ రూపాన్ని ఈ పీఠిక విశిధి కారిస్తుంది.కులనికో దేవుడు మతానికి ఒక గ్రంధం ఉంటుం దేమో కానీ ప్రజలందరికీ వర్తిం చే రాజ్యాంగం బాధ్యతగా ప్రతి ఒక్కరు తెలుసు కోవాల్సిందే. పీఠిక లోని అంశాలు బహుళ ప్రచారం లోకి తేవాలి.అది అందరి బాధ్యత.ఒక్కసారి మననం చేసుకోవాలి. అంబే ద్కర్ ఒక వర్గం వాడు కాదు దేశ ప్రజలందరి వాడు ఆయన ఏ లక్ష్యం కోసం ప్రపంచంలో నే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అందించారు. ఆయన ఆశయా లు అమలు జరిగితే చాలు బడుగు బలహీన ,వర్గాలకు న్యాయం జరుగుతుంది.
150 కోట్ల జనాభా లో నేటికి కొందరు కనీస అవసరాలు కూడా తీరని ప్రజలు ఉన్నారు ఉండడ.అవిశేష పరిజ్ఞానం తో రాసిన రాజ్యాంగం మాత్రమే నేటి సమస్యల పరిష్కారానికి మార్గం అరిస్టాటిల్ చెప్పిన మాట ఒక్కటీ గుర్తు చేసుకోక తప్పదు ఉత్తమ ప్రజలు ఉత్తమ రాజ్యం నిర్మిస్తారు.చెడ్డ ప్రజలు చెడ్డ రాజ్యాంగాన్ని నిర్మిస్తారు.రాజ్యాంగం పట్ల అవగాహన బాధ్యతగా తెలు సుకొని వాటి విలువల కు ప్రతి ఒక్కరు బాధ్యత ఉంటేమంచి ఫలితాలుఆశించవచ్చు.ప్రతి ఒక్కరు రాజ్యాంగం చదివి అవగాహన పెంచుకోవాలి.
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


