*కర్ణాటకలో దారుణం: సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి సహా ముగ్గురు మృతి..!
_కలబురగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 26 (అఖండ భూమి న్యూస్);
కలబురిగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టడంతో సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి, ఇద్దరు బంధువులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.వారి మృతి పట్ల పలువురు ఉన్నతాధికారులు కూడా విషాదాన్ని వ్యక్తం చేశారు._


