దోమకొండ 6 వార్డుకు నామినేషన్ వేసిన అబ్రబోయిన రాజేందర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 28 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ గ్రామపంచాయతీ ఆరవ వార్డు మెంబర్ గా అబ్రబోయిన రాజేందర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. దోమకొండ గ్రామపంచాయతీ ఆరో వార్డు మెంబర్ గా ఆదర్శ వర్డుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వార్డు మెంబర్ గా పోటీలో నిలుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాళ్లు సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. వార్డ్ లోని ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో మద్దతు తెలపడంపై వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అబ్రబోయిన రాజేందర్ అనే నేను వార్డు సభ్యుడిగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.


