నల్లమల సాగర్ను కృష్ణా జలాలతో నింపుతాం

నల్లమల సాగర్ను కృష్ణా జలాలతో నింపుతాం

పెద్ద దోర్నాల అఖండ భూమి.

రాష్ట్ర చరిత్రలో దగాకి మోసానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు లో జగన్ చేసిన త ప్పిదాలు మోసం, దగా, జిల్లా రైతులకు తెలియాలనే రైతులతో కలసి సమీక్ష నిర్వహి ంచినట్లు ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్లో 2200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. 18నెలల కాలంలోనే టన్నెల్స్ లో క్లిష్టమైన 3 కి.మీ లైనింగ్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు చేస్తుండగా, గ్యాంట్రీల సంఖ్యను పెంచి లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామని ఆయన అన్నారు. ఫీడర్ కెనాల్ లో 45వేల క్యూబిక్ మీటర్ల హార్డ్ రాక్ పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికే 28వేల క్యూబిక్ మీటర్లు పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 456 కోట్లతో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ డిసెంబర్ లోనే పనులు మొదలుపెట్టి సీజన్ వచ్చేలోప పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామన్నారు. తీగలేరు కెనాల్ కు సంబందించి 600మీటర్ల టన్నెల్ లైనింగ్ చేసి, గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నల్లమల సాగర్ ముంపుతో 9.6 కి.మీ పర్మినెంట్ డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టా మన్నారు.మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు పూడ్చి, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను పూర్తి చేసి, లైనింగ్ పనులు కొత్త లక్ష్యాలు నిర్దేశించి వేగంగా చేస్తున్నామన్నారు. ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినావెలిగొండ ప్రాజెక్టు ను ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి, పూర్తి చేయాలని సిఎం చంద్రబాబు అనుక్షణం మ మ్మల్ని ప్రోత్సహిస్తూ పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు

సొరంగాన్ని పరిశీలిస్తున్న మంత్రి రామానాయుడు

ఆదేశాల మేరకు ముందు నిర్ణయించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా వెలిగొండ ప్రా జెక్టు పనులు పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి రామా నా యుడు చెప్పారు. 2026 నాటికి వెలిగొండ పూర్తి చేసి నల్లమలసాగర్ ను కృష్ణా జలా లతో నింపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రాజెక్ట్ సూపర్నెంట్ ఇంజనీర్ అబూత్ అలీ మెగా కంపెనీ ప్రతినిధులు ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజనీర్లు రెవిన్యూ అధికారులుమండల టిడిపి కన్వీనర్ షేక్ మహబూబ్ బాషా మండలంలోని రైతులు నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!