*ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు – కొత్త బిల్లు వివరాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 18 (అఖండ భూమి న్యూస్);
ఇప్పటి వరకు కొనసాగుతున్న ఎంజిఎన్ఆర్ఇజిఏ స్థానంలో
“వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ & ఆజీవిక మిషన్ (గ్రామీణ్)”
అనే కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది..
ముఖ్య మార్పులు:
పని దినాలు: 100 , 125 రోజులు..
అయితే ఏడాదిలో 60 రోజులు బ్రేక్ (వ్యవసాయ సీజన్లో) ఉంటుంది
కొత్త జాబ్ కార్డ్: గ్రామీణ్ రోజ్ గార్ గ్రాంటెడ్ కార్డ్
వాలిడిటీ 3 సంవత్సరాలు మాత్రమే
ప్రత్యేక వర్గాలకు స్పెషల్ కార్డ్స..
నిధుల విధానం మార్పు:
ఇప్పటివరకు వేతనం 100% కేంద్రం
ఇకపై
– ఎన్ ఈ / హిల్ రాష్ట్రాలు: 90% కేంద్రం – 10% రాష్ట్రం
– ఇతర రాష్ట్రాలు (ఏపీ, తెలంగాణ సహా): 60% కేంద్రం – 40% రాష్ట్రం
రాష్ట్రాలపై అదనంగా ₹30,000 కోట్లు భారం..
ప్లానింగ్ విధానం:
రాష్ట్రాల లేబర్ బడ్జెట్ ఇక ఉండదు..
కేంద్రం ముందే నిధులు ఫిక్స్ చేస్తుంది (నర్మటీ అలోక్షన్ )
కరువు/డిమాండ్ పెరిగితే అదనపు ఖర్చు రాష్ట్రాలదే..
పనుల ఎంపిక:
వికసిట్ గ్రామపంచాయతీ ప్లాంట్స్ .
పీఎం ఘాటి శక్తి i తో అనుసంధానం..
నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఉపాధి, వాతావరణ చర్యలపై ఫోకస్..
జరిమానాలు:
పాతది: ₹1,000
కొత్తది: ₹10,000 వరకు..
మొత్తం బడ్జెట్ అవసరం:
సుమారు ₹1.51 లక్షల కోట్లు / సంవత్సరం..
మొత్తం మీద:
పని రోజులు పెరిగినా, రాష్ట్రాలపై ఆర్థిక భారం భారీగా పెరిగే అవకాశం..


