మహంకాళి అమ్మవారి కి పట్టు వస్త్రాలు సమర్పించిన మహమ్మద్ ఇలియాస్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 02 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మహంకాళి అమ్మవారికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారికి ఆలయంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ మధ్య అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ సంవత్సరం షబ్బీర్ అలీ కుటుంబం నుండి పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, సర్పంచ్ నరసయ్య, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, బక్యాల రేఖ, సుదర్శన్, ఆలయ కమిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, లింగం, కదిరి గోపాల్ రెడ్డి, బాలరాజు, వెంకటేశం గ్రామస్తులు పాల్గొన్నారు.


