బోనాల ఉత్సవాలను ప్రజలంతా సంతోషంతో జరుపుకోవాలి…

*బోనాల ఉత్సవాలను ప్రజలంతా సంతోషంతో జరుపుకోవాలి…

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 02 (అఖండ భూమి న్యూస్);

హైదరాబాద్ బొగ్గులకుంట లో దేవాదాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆషాడ మాస బోనాల చెక్కుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదివారం అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆషాడ మాస బోనాల నిమ్మితం 22 కోట్ల రూపాయలు మంజూరు చేయగా. మలక్ పేట్ నియోజకవర్గానికి 106 మందిరాలకు గాను 33 లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మలక్ పేట్ నియోజకవర్గ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.

భవిష్యత్‌ తరాలకు సంస్కృతి,సంప్రదాయాలను చాటి చెప్పేలా పండుగలను నిర్వహించుకోవాలని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!