జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో (నెంబర్ 252 ) ని నిరసిస్తూ కామారెడ్డి లో నేడు ఛలో కలెక్టరేట్…
*తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టీయూడబ్ల్యుజే హెచ్ 143 ) పిలుపు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 26 (అఖండ భూమి న్యూస్);
అర్హులైన జర్నలిస్టూలందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 27 న శనివారం రోజున ఉదయం 10.30 గంటలకి నిరసన కార్యక్రమం..గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది.
జిల్లా లోని జర్నలిస్ట్ లు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి జర్నలిస్ట్ ల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.


