గౌడ సంఘం ఆధ్వర్యంలో దోమకొండ జిపి పాలకవర్గానికి సన్మానం…

గౌడ సంఘం ఆధ్వర్యంలో దోమకొండ జిపి పాలకవర్గానికి సన్మానం…

 

దోమకొండ జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 31 (అఖండ భూమి న్యూస్);

 

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో దోమకొండ గ్రామపంచాయతీ పాలకవర్గానికి బుధవారం సన్మానం నిర్వహించారు. దోమకొండ సర్పంచ్ ఐరన్ ని నరసయ్యతో పాటు ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ 16 వార్డుల సభ్యులకు శాలువలతో గౌడ సంఘం ప్రతినిధి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. దోమకొండ గ్రామాన్ని జిల్లాలోని అతిపెద్ద మేజర్ పంచాయతీ గా ఉందని దోమకొండను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సంకల్పంతో పనిచేసి పాలకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు తీగల సుదర్శన్ గౌడ్, కర్రోల శ్రీకాంత్, కర్రోళ్ల శ్రావణ్ గౌడ్, దేవేందర్ గౌడ్, భీమగౌడ్, సిద్దా గౌడ్, తిరుమల గౌడ్, రామా గౌడ్, శ్యామ్ గౌడ్, రాజేందర్ గౌడ్, రాగుల శ్రీకాంత్ గౌడ్ కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!