రాష్ట్రస్థాయి గణిత ప్రతిభ పరీక్షకు గురుకుల విద్యార్థి ఎంపిక… 

రాష్ట్రస్థాయి గణిత ప్రతిభ పరీక్షకు గురుకుల విద్యార్థి ఎంపిక…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 31 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఎస్. మానస రాష్ట్రస్థాయి గణిత ప్రతిభ పరీక్షకి ఎంపికైనట్లు ఆ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కవిత తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన గణిత ప్రతిభా పరీక్షలో మానస ఉత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. ఎంపికైన ఆ విద్యార్థినిని బుధవారం గైడ్ గణిత ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థుల సమక్షంలో అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!