మహిళ సంఘాలకు పాడి పశువులు…

మహిళ సంఘాలకు పాడి పశువులు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 4.

(అఖండభూమి న్యూస్):

 

తెలంగాణ రాష్ట్రంలోని పొదుపు మహిళా సంఘాలకు త్వరలో పాడిపశువులను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరా డైరీ ప్రాజెక్టు కింద ఒక్కో మహిళకు రెండేసి పాడిపశువులను అందిస్తామని అన్నారు. 70 శాతం శాతం సబ్సిడీ, 30% బ్యాంకు రుణం అందించి ఈ పాడిపశువులను అందించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామని చెప్పారు. ముందుగా మధిరను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని, త్వరలో ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. మహిళలను స్వసక్తితో అభివృద్ధి చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించామని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు….

Akhand Bhoomi News

error: Content is protected !!