అక్రమంగా రక్తం సేకరణ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు….

అక్రమంగా రక్తం సేకరణ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు….

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 4.

(అఖండభూమి న్యూస్):

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నోరులేని మేకలు, గొర్రెల శరీరం నుండి రక్తాన్ని అక్రమంగా సేకరిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా, అడ్డగోలుగా రక్తం తీయడం వలన ఆ మూగజీవాలు ఒకటి రెండు రోజులలోనే ప్రాణాలు కోల్పోతున్నాయని గొర్రెల కాపర్లు పోలీసులకు చెప్పారు. ఈ రక్తం కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని గొర్రెల కాపరులకు మాయమాటలు చెప్పి, ప్యాకెట్లలో రక్తం నింపి, ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారంలో మటన్ షాప్ నిర్వాహకుని తో పాటు ఓ నకిలీ బస్సు వైద్య అధికారి సైతం భాగస్వామి కావడం విశేషం.

Akhand Bhoomi News

error: Content is protected !!