పట్టాలెక్కనున్న తొలి ‘వందే భారత్’ స్లీపర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 4 (అఖండ భూమి న్యూస్);
భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం మొదలుకానుంది. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు సేవలు ఈ జనవరిలోనే ప్రారంభం కానున్నాయి. మొదటి సర్వీసును అస్సాంలోని గౌహతి, పశ్చిమ బెంగాల్లోని హౌరా (కోల్కతా) మధ్య నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం 16 కోచ్లతో రూపొందిన ఈ రైలులో 11 ఏసీ 3-టైర్, 4 ఏసీ 2-టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లు ఉన్నాయి.


