వరి సాగులో ముందంజలో ఉన్న తెలంగాణ…!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 10
(అఖండభూమి న్యూస్):
భారతదేశంలో 2014, 15 సంవత్సరం నుండి 2024, 25 వరకు వరి సాగు ఉత్పత్తి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో ఘననీయంగా వరి సాగు పెరిగిందని వ్యవసాయ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో +240 %, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో+80%, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో+25 శాతం, తమిళనాడు రాష్ట్రంలో+20%, పంజాబ్ రాష్ట్రంలో+12 శాతం వరి సాగు పెరిగిందని గణాంకాలు విడుదల చేసింది. మణిపూర్ రాష్ట్రంలో -20%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో -13%, అస్సాం రాష్ట్రంలో -12 %, కర్ణాటక రాష్ట్రంలో -11%, ఒడిశా రాష్ట్రంలో -ఎనిమిది శాతం ఉత్పత్తులు తగ్గినట్లు ప్రకటించింది.


