అధికారుల సాక్షిగా వృధాగా పారుతున్న నీరు..

గోవర్ధనగిరిలో వృధాగాపారుతున్న మంచినీరు…

         అధికారుల పర్యవేక్షణ సాక్షిగా పారుతున్న నీరు..

పట్టించుకోని గ్రామ సర్పంచ్

వెల్దుర్తి మే 17 (అఖండ భూమి ) : మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో నీరు వృధాగా పారుతున్న వైనం. అధికారుల సాక్షిగా వృధాగా పారుతున్న పట్టించుకోని అధికారులు. గ్రామ సర్పంచ్ సక్రమంగా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ తతంగం జరుగుతుందని గ్రామ ప్రజలు వెల్లడిస్తున్నారు. అసలే ఎండాకాలం జనాభా ఎక్కువగా ఉన్న గ్రామం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. గ్రామానికి ఒకానొకప్పుడు నీరు సక్రమంగా లేని సమయంలో అధికారుల సైతం ప్రజాప్రతినిధులకు తగాదాలు పడేవారు. అయితే నీరు సమృద్ధిగా ఉన్న సమయంలో నీటిని వృధాగా పారించడం ఎంతవరకు సభవని పరిశీలకులు భావిస్తున్నారు. కుళాయిలకు ట్యాబులు సక్రమంగా లేకపోవడం మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడం నీరు వృధాగా పారుతుందని చెప్పగానే చెప్పవచ్చు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని పారే నీరును అదుపు చేసి నీటిని పొదుపు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!