*తీన్మార్ మల్లన్న పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి: జనవరి 17 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు అండగా నిలవడం, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయడం తీన్మార్ మల్లన్న ఆలోచనలకు ప్రతీక అని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సామల వెంకటేశం.
జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు సిగదపు సిద్ధన్న
కార్యదర్శి జావేద్.
ఎండీ ఫసియుద్దీన్
రవి తదితరులు పాల్గొన్నారు
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


