*రూ.5 వేలతో ఆశపెట్టి.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.9 కోట్లు స్వాహా…

*రూ.5 వేలతో ఆశపెట్టి.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.9 కోట్లు స్వాహా…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి! జనవరి 19 (అఖండ భూమి న్యూస్);

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. గతేడాది నవంబరు 12న వాట్సాప్‌లో వచ్చిన లింకు ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల సలహాలు ఇచ్చే గ్రూపులో చేరిన బాధితుడు, అనిల్ గోయల్ అనే వ్యక్తి చెప్పినట్లుగా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. 300 శాతం లాభాల ఆశతో మొదట రూ.50 వేలు పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత మొత్తం రూ.2.9 కోట్లు బదిలీ చేశాడు. యాప్‌లో రూ.3.47 కోట్లు కనిపించినా, డబ్బును విత్‌డ్రా చేసుకోలేక మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Akhand Bhoomi News

error: Content is protected !!