*రూ.5 వేలతో ఆశపెట్టి.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.9 కోట్లు స్వాహా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి! జనవరి 19 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాద్లోని శేరిలింగంపల్లికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. గతేడాది నవంబరు 12న వాట్సాప్లో వచ్చిన లింకు ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల సలహాలు ఇచ్చే గ్రూపులో చేరిన బాధితుడు, అనిల్ గోయల్ అనే వ్యక్తి చెప్పినట్లుగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. 300 శాతం లాభాల ఆశతో మొదట రూ.50 వేలు పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత మొత్తం రూ.2.9 కోట్లు బదిలీ చేశాడు. యాప్లో రూ.3.47 కోట్లు కనిపించినా, డబ్బును విత్డ్రా చేసుకోలేక మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
You may also like
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…
బాధిత కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్…


