జాతీయ అవార్డు పొందిన అధ్యాపకుడికి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం…

*జాతీయ అవార్డు పొందిన అధ్యాపకుడికి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);

ఈనెల 10 న భువనేశ్వర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సెమినార్ లో సౌత్ క్యాంపస్ సోషల్ వర్క్ హెడ్ అయిన డా. అంజయ్య బందెల ను “భారత్ వికాస్ అవార్డ్ ” తో సత్కరించారు.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆధ్వర్యంలో భువనేశ్వర్ ,ఒడిశా లోని ప్రెస్ క్లబ్ లో *పచ్చని భవిష్యత్ దిశగా పునర్నిర్మాణం*అనే అంశంపై జాతీయ సదస్సు ను ఈ జనవరి 10 న నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న మేధావులు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు వేదికగా నిలిచింది. అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మేధావులకు అవార్డ్ లతో సత్కరించారు. ఈ సందర్భంగానే డా.అంజయ్య బందెల ను భారత వికాస్ అవార్డ్ తో సత్కరించారు.

దీన్ని పురస్కరించుకొని సౌత్ క్యాంపస్ లో నేడు ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ ఆద్వర్యంలో సన్మానించారు.

ఆయన మాట్లాడుతూ ఈ క్యాంపస్ అధ్యాపకుడికి అవార్డ్ రావడం చాలా సంతోషం అన్నారు. ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి అవార్డ్ ఇచ్చారని అన్నారు. అలాగే మిగతా అధ్యాపకులు స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్లో అవార్డ్ లు సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. రాజేశ్వరి,హాస్టల్ వార్డెన్ డా.సునీత, NSS అధికారి డా.హరిత లక్కరాజు,apro డా. సరిత పిట్ల, అధ్యాపకులు డా.సబిత, డా.లలిత,డా.మోహన్ బాబు,డా.నాగరాజు,డా.కవిత తోరణ్, డా.ప్రతిజ్ఞ,డా.నారాయణ,డా.నరసయ్య,డా.రమాదేవి, వైశాలి,సునీల్, శ్రీనివాస్,డా.కనకయ్య,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!