దోమకొండలో పెన్షన్లు పంపిణీ పరిశీలించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్..
.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని దుబ్బ బంగ్లాలో శనివారం పెన్షన్ పంపిణీ ప్రక్రియను మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ పరిశీలించారు. ఏడుగురు సిబ్బందితో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. దోమకొండలో 3258 పింఛన్లు వివిధ గ్రామాలలో 7245 మండలం మొత్తం కలిపి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పోస్ట్ మాస్తార్ సురేష్ కు, గడి కోట ట్రస్ట్ చైర్మన్ బాబ్జి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్ ప్రక్రియను కొనసాగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


