సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26(అఖండ భూమి న్యూస్):
కామారెడ్డి జిల్లా దోమకొండ సామాజిక 30 పడకల ఆరోగ్య కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్డెంట్ వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ విలువలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి ప్రతినిత్యం వచ్చిన ప్రజలకు మరింత నిబద్ధతతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


